| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం

News

Posted on 2026-06-20 19:13:02

Share: Share


ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం

డైలీ భారత్, కామా రెడ్డి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నిరంతర పర్యవేక్షణ తో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కామారెడ్డి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా విశిష్ట ప్రగతిని నమోదు చేసింది. పేదలకు గృహ కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది.

జిల్లాలో మొత్తం 12,090 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, వాటిలో 10,945 ఇళ్లు (90.52 శాతం) గ్రౌండింగ్ పూర్తి అయ్యాయి. ఇప్పటికే లబ్ధిదారులకు రూ.238.77 కోట్లు విడుదల చేయగా, నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

గ్రౌండింగ్ పూర్తయిన ఇళ్లలో 6,077 ఇళ్ల నిర్మాణాలు పైకప్పు స్థాయికి చేరుకోగా, మరిన్ని ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణాలను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది.

అదేవిధంగా, పథకం కింద 2,365 మంది లబ్ధిదారులకు రూ.31.97 కోట్లు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందజేయగా, బ్యాంకుల సహకారంతో మరింత మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే చర్యలు కొనసాగుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల ఫేజ్–2 అమలుకు సంబంధించి జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. అర్హులైన పేద కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కామారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >