| Daily భారత్
Logo




40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ

News

Posted on 2026-06-20 19:13:51

Share: Share


40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ

డైలీ భారత్, కామారెడ్డి : ఒలింపిక్ విలువలు, క్రీడాస్ఫూర్తి మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రజల్లో ప్రోత్సహించే లక్ష్యంతో శనివారం కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన 40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడాస్ఫూర్తితో వివిధ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ఎంత శ్రద్ధ చూపుతున్నారో, క్రీడల పట్ల కూడా అంతే ప్రోత్సాహం అందించాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడటంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం అధికారులు పాల్గొన్న విద్యార్థులు, క్రీడాకారులు, యువతను అభినందించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీ విక్టర్ ఎన్.వి. గిరి , కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్ , సంబంధిత జిల్లా అధికారులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ డా. కె.పీ. అనిల్ కుమార్ , చైర్మన్ డా. ఎం. జైపాల్ రెడ్డి , క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >