| Daily భారత్
Logo




స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

News

Posted on 2026-06-20 20:26:39

Share: Share


స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి జూపార్క్‌గా రికార్డు

తెలంగాణ అటవీ శాఖకు మంత్రి కొండా సురేఖ అభినందనలు

డైలీ భారత్, న్యూఢిల్లీ/ హైదరాబాద్: అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న కృషికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మౌస్ డీర్ (Mouse Deer) సంరక్షణ, బ్రీడింగ్ మరియు అడవుల్లోకి పునరావాసం (Conservation Breeding & Reintroduction) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రతిష్టాత్మక స్కాచ్ (SKOCH) అవార్డును అందుకుంది. వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో ఈ అవార్డును అందుకున్న దేశంలోని తొలి జూపార్క్‌గా నెహ్రూ జూలాజికల్ పార్క్ నిలిచింది.

కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమలో భాగంగా అందించే ఈ అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీ లో జరిగింది.. నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ వసంత ఈ అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అటవీ దళాల అధిపతి (PCCF & HoFF) డా. సీ. సువర్ణ, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం వల్లే ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధ్యమైందన్నారు. అలాగే మౌస్ డీర్ సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జూ సిబ్బంది, సాంకేతిక బృందం, సహచర ఉద్యోగుల కృషిని ఆమె అభినందించారు.

ఈ అవార్డు లభించడం పట్ల జూ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియలో సహకరించి, తమకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ జూ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (PCCF) వినయ్ కుమార్ మాట్లాడుతూ, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి వినూత్న సంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు.

ఈ అవార్డు సాధించిన నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు, సిబ్బందితో పాటు తెలంగాణ అటవీ శాఖను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు సాధించాలని ఆకాంక్షించారు.

Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >
Image 1

ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డ్స్ అందించాలి

Posted On 2026-06-22 20:06:26

Readmore >
Image 1

వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం

Posted On 2026-06-22 19:49:36

Readmore >
Image 1

వైరా నియోజకవర్గం : కమ్మవారి కల్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితా సవరణ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Posted On 2026-06-22 19:48:03

Readmore >
Image 1

తలాపున గోదావరి... ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కరువు!

Posted On 2026-06-22 19:46:38

Readmore >
Image 1

రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Posted On 2026-06-22 19:45:38

Readmore >
Image 1

చెన్నై ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహారం : భార్య అమర్చిన రహస్య CCTVలో భర్త

Posted On 2026-06-22 19:44:31

Readmore >
Image 1

నేరెళ్ల పీహెచ్‌సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర

Posted On 2026-06-22 18:54:32

Readmore >
Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >