Posted on 2026-07-03 18:28:35
డైలీ భారత్, నాతవరం: అనకాపల్లి జిల్లా నాతవరంలో జరిగిన వివాహ వేడుకలో చోటుచేసుకున్న భారీ దోపిడీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఛేదించారు.
పెళ్లి మండపంలో జరిగిన ఈ స్నాచింగ్లో రూ.5,60,000/- నగదు చోరీకి గురైంది. బాధితులు వెంటనే అప్రమత్తమై 112 అత్యవసర నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన నాతవరం పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి చోరీకి గురైన మొత్తం రూ.5,60,000/- నగదును పూర్తిగా రికవరీ చేశారు. కేసును వేగంగా ఛేదించిన నాతవరం పోలీసులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా IPS, డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
అత్యవసర సమయంలో 112 నంబర్కు కాల్ చేయడం వల్ల నేరస్తులను త్వరగా పట్టుకోవడానికి వీలవుతుందని, ప్రజలు ఈ సేవను వినియోగించుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా కోరారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >