Posted on 2026-07-03 23:04:17
రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విలేకరి అపర్ణ కుటుంబాన్ని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ పరామర్శించి అండగా నిలిచినరు. అపర్ణ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన, ఆమె కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి రూ.10,000ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ, జర్నలిస్టుల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అపర్ణ జర్నలిజం రంగంలో తన సేవలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ఈ లోటు ఎప్పటికీ తీరనిదేనని, అయితే ప్రెస్ క్లబ్ తరఫున సాధ్యమైనంత సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఆర్థిక సహాయం అందుకున్న అపర్ణ కుటుంబ సభ్యులు జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ధైర్యం చెప్పడం ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ, సహచర పాత్రికేయుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించి సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు, పాత్రికేయులు, అపర్ణ కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >