| Daily భారత్
Logo




దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

News

Posted on 2026-07-11 05:32:51

Share: Share


దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన మారణహోమం స్థానికంగా కలకలం రేపింది. POCSO కేసులో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి బాలిక కుటుంబంతో పాటు తన సొంత భార్య, ఇద్దరు చిన్నారులను కూడా దారుణంగా హత్య చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం, దైవాలగూడకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను రాజ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. ఈ విషయంపై బాలిక తల్లితో కలిసి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజ్ కుమార్‌పై POCSO చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

బెయిల్‌పై విడుదలైన తర్వాత రాజ్ కుమార్ కక్షతో రగిలిపోయాడు. శనివారం తెల్లవారుజామున బాలిక ఇంటికి వెళ్లి 65 ఏళ్ల రుక్కమ్మ, 45 ఏళ్ల లక్ష్మీలను హత్య చేశాడు. ఆ తర్వాత బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి కూడా హత్య చేశాడు.

ఇక్కడితో ఆగకుండా తన ఇంటికి వెళ్లి 30 ఏళ్ల భార్య పార్వతి సరిత, 3 ఏళ్ల కుమారుడు పరీక్షిత్, 2 ఏళ్ల కుమారుడు దైవిక్షిత్‌లను కూడా చంపేశాడు.

అన్ని హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి "6 మందిని చంపేశాను" అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న షాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 6 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భార్యా పిల్లలను ఎందుకు చంపాడనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >