Posted on 2024-09-10 09:24:27
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గులాబీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీమంత్రి సతీమణి మరణించారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భార్య డాక్టర్ శ్వేత తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించడం జరిగింది. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి భార్య తీవ్ర అనారోగ్యంతో పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి ఆస్పత్రిలోనే మరణించినట్లు సమాచారం. హోమియోపతి వైద్యుడైన లక్ష్మారెడ్డి.. జడ్చర్ల ఎమ్మెల్యేగా పలుసార్లు విజయం సాధించారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఇంధన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా లక్ష్మారెడ్డి పనిచేయడం జరిగింది. ఇక లక్ష్మారెడ్డి భార్య మృతి చెందిన నేపథ్యంలో గులాబీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >