Posted on 2024-10-01 10:32:43
డైలీ భారత్, హైదరాబాద్: ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ప పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..యూసుఫ్గూడ, నవోదయ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ వద్ద నివాసముండే ఉమామహేశ్వరరావు ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు.
ఎల్లారెడ్డిగూడలోని టెంపుల్ పక్కన అమ్మ క్లినిక్ పేరిట ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. అయితే, నవోదయ కాలనీలోని ప్లాట్ నెంబర్.36 రెండవ ఫ్లొర్లో తన భార్య సుధారాణి (44), కుమార్తె రుద్రారాణి, కుమారుడు శ్రీకర్ చంద్రతో కలిసి ఉంటున్నాడు.
అయితే,సోమవారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పక్క వీధిలో ట్యూషన్ కోసం వెళ్లారు.భర్త ఉమామహేశ్వర రావు క్లినిక్కు వెళ్లాడు. ఈ క్రమంలోనే పిల్లలు తిరిగి వచ్చేసరికి సుధారాణి రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉంది. గమనించిన పిల్లలు వెంటనే తండ్రికి ఈ విషయాన్ని చెప్పారు.సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోగానే సుధారాణి చనిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్దారించారు.డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీం ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >