Posted on 2024-10-20 10:00:49
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ప్రొఫెసర్. వి. బాలకృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్ గా ప్రొఫెసర్. ఇటిక్యాల పురుషోత్తం నీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వీరిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ మరియు జాక్ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంతో పోటీ పడాలంటే రాష్ట్రంలో జాతీయ విద్యా విదానాన్ని అమలు చేయాలని అలాగే ఉన్నత విద్యాభివృద్దిలో కాలానుగుణంగా మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఈ మేరకు కోరారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎమ్మార్పిస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ, జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ మరియు రాష్ట్ర జాక్ కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >