Posted on 2024-11-06 13:20:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: దుమ్మగూడెం మండలం తూరుబాక గ్రామంలో భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై విపరీతమైన గుంతలు వీటి వలన వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు
భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే భక్తులకు కూడా ఈ గుంతల వల్ల కొత్తగా వచ్చేవారు గనుక రోడ్లమీద అవగాహన లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
వరదల కారణంగా మరియు విపరీతమైన అధిక లోడులతో ఇసుక లారీలు వెళ్లటం వల్ల రోడ్లు అంత పాడైపోయాయి.
మరీ ముఖ్యంగా తూరుబాకులో కూలిపోయిన వంతెన కోసం రోడ్డు డైవర్షన్ ఇస్తే ఆ డైవర్షన్ దాటుకొని ప్రధాన రహదారి ఎక్కే ముందే రోడ్లు అద్వానంగా తయారయ్యాయి
అంతేకాకుండా ప్రధానంగా తూరుబాకలో ప్రమాదపు మలుపుల వద్ద రోడ్లు అద్వానంగా తయారయ్యాయి దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు
ఇప్పటికైనా సంబంధిత అధికారులు గానీ మానవతా దృక్పథంతో స్పందించేవారు గానీ తొందరగా స్పందించి ఆ రోడ్డుకి మరమ్మత్తులు జరిపిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >