Posted on 2025-05-14 11:11:11
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ వాతావరణ శాఖ, తెలంగాణలో హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం తో పాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, తెలిపింది అయితే ఈ సాయంత్రం నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని పలు జిల్లాలకు ఆరెం జ్ అలర్ట్ జారీ చేశారు.ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం తో బుధవారం తెలంగా ణలోని నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహాబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగా లు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, వరంగ ల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్కర్నూల్, అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు 30 నుంచి 40 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవ్వాళ, రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 16వ తేదీన కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.ఇక మరోవైపు చురుక్కా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మంగళవారం మధ్యాహ్నం నాటికి దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు నికోబా ర్ దీవులను తాకినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే దక్షిణ బంగాళా ఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా ఈ రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. అయితే ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా అండమాన్, నికోబార్ దీవుల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >