| Daily భారత్
Logo




టెక్కలి నియోజకవర్గంలో రూ. 24 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులుకు శంకుస్థాపన

News

Posted on 2025-06-15 20:19:04

Share: Share


టెక్కలి నియోజకవర్గంలో  రూ. 24 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులుకు శంకుస్థాపన

గ్రామీణ రహదారులుకు  మహర్దశ

పల్లెల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన గత ప్రభుత్వం

ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని విమర్శ

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలికొదిలేసింది

రాష్ట్రంలో 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం అమలు కూటమి ప్రభుత్వం ఘనత

రావివ‌ల‌స‌ గ్రామ పంచాయతీ పరిధిలో రూ.11.28  కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు  శంకుస్ధాప‌న‌

టెక్కలి మండలం కేంద్రంలో రూ. 13 కోట్ల రూపాయలతో పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధికి శంకుస్థాపన

డైలీ భారత్, శ్రీకాకుళం:శ్రీ‌కాకుళం జిల్లా  టెక్క‌లి  నియోజ‌క‌వ‌ర్గం  రావివ‌ల‌స‌  పంచాయితీ పరిధిలో పంచాయతీ రాజ్  శాఖ నిధుతో  రూ.11.28  కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు  రాష్ట్ర  వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆదివారం శంకుస్ధాప‌న చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వం అయిదేళ్లూ  ప‌ల్లెల అభివృద్ధిని పూర్తిగా వ‌దిలేసింద‌ని, క‌నీస మౌళిక  స‌దుపాయాలు క‌ల్పించక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు క‌ష్టాలు ప‌డ్డారని విమర్శించారు.

గ్రామాలు అభివృద్ధి దిశ‌గా న‌డిపేందుకు  కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుందన్నారు. 

రావివ‌స‌ల గ్రామ ప‌రిధిలో అభివృద్ధి పనులకు  శ్రీ‌కారం

రావివలస గ్రామ ప్రధాన వీధిలో రూ.80 లక్షలు, దామో దరపురంలో రూ.90 లక్షలు, చిన్న నారాయణపురంలో రూ.60 లక్షలతో సీసీ రహదా రులు, కాలువలు నిర్మాణ ప‌నులు చేప‌ట్టేందుకు  శంకుస్ధాప‌న చేశారు. అదేవిధంగా పాత కాలనీలో రూ.51 లక్షలు, కొత్త కాలనీలో రూ. 60 లక్షలతో కాలువల ఏర్పాటు శంకుస్ధాప‌న చేశారు. అలాగే నౌపడ-  రహ దారి నుంచి చిన్ననారాయణ పురం గ్రామానికి ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం కోసం  రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు, రూ.50 లక్షలతో కల్వర్టు నిర్మాణ ప‌నులు శంకుస్ధాప‌న  చేశారు.  చిన్ననారాయణపురం ఎస్సీ కాలనీలో రూ.50 లక్షలతో రహదారి, రూ.30 లక్షలతో శ్మశానవాటికకు మార్గం, రావివలస, దామోదరపురం, చిన్ననారాయణపురం గ్రామాల్లో శ్మశానవాటికల అభి వృద్ధికి రూ.75 లక్షలు రావివలస నుంచి ఎండలమల్లి కార్జున స్వామి దేవస్థానానికి రూ.3 కోట్లతో రహదారి  కొత్తకాలనీలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి రూ.12 లక్షలు, డ్వాక్రా భవనం నిర్మా ణానికి రూ.30 లక్షలతో నిర్మాణం చేప‌ట్ట‌నున్న ప‌నుల‌కు  శంకుస్ధాప‌న  చేశారు.

ఇంటిం టికీ కుళాయిల ద్వారా నీరందించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు  తీసుకోనున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైంది

గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని విమర్శించారు.

రాష్ట్రంలో  తల్లికి వందనం పథకం అమలు చేశాం. తల్లుల ఖాతాలో నగదు జమ‌ చేశామని చెప్పారు. రాష్ట్రంలో 67 లక్షల మంది లబ్ధిదారులకు ఖాతాలో నగదు జమ‌ చేశామని చెప్పారు.

తల్లికి వందనం అమలు కూటమి ప్రభుత్వం ఘనత అన్నారు.

సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్నారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాలలు తెరిచిన రోజే, పిల్లలకు కొత్త పుస్తకాలు, యూనిఫారం, బెల్ట్, బూట్లు, సాక్సులు పిల్లలకు అందజేయాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణ మూర్తి,తెదేపా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >
Image 1

హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

Posted On 2026-04-21 16:28:14

Readmore >
Image 1

భూమి మన బతుకు శ్వాస -- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-21 16:26:27

Readmore >