| Daily భారత్
Logo




భర్త హత్య కేసులో భార్యతో పాటు మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదు,ఒక్కొక్కరికి 2000/- జరిమానా

News

Posted on 2025-06-20 20:24:08

Share: Share


భర్త హత్య కేసులో భార్యతో పాటు మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదు,ఒక్కొక్కరికి 2000/- జరిమానా

జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు.

నిందుతులకు శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:భర్త హత్యకు కారణమైన భార్య తో పాటుగా మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదు,ఒక్కక్కరికి 2000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి  నీరజ శుక్రవారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

వివరాల మేరకు..

ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన దరంసోత్ శంకర్ నాయక్ s/oరామ్ నాయక్ age 55 y అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు మొదటి భార్య దరంసోత్ సరోజకు పిల్లలు పుట్టడం లేదని రాజవ్వ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు జన్మించారు అప్పటినుండి మొదటి భార్య అయిన దరంసోత్ సరోజ వారిపై పగ పెంచుకొని గొడవలు పడుతూ ఉండేది, వారికున్న ఆస్తి అంతా రెండవ భార్య మరియు వారి సంతానానికి రాసిస్తాడు అనే భయంతో తన భర్త అయినటువంటి శంకర్ నాయక్ ను తేదీ 28.11.2020 రోజున మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పథకం ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సరోజ, ఆమె తమ్ముడైన బానోతు శ్రీనివాస్, చెల్లెలు తేజావత్ లక్ష్మి లను పిలిపించుకొని భర్త శంకర్ నాయక్ కి మందు బాగా తాగించి రోకలిబండతో కొట్టి ముగ్గురు కలిసి చంపినారు.

ఈ కెసులో రెండో భార్య అయినటువంటి రాజవ్వ ఫిర్యాదు మేరకు అప్పటి సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు పంపించడం జరిగింది.తరువాత సిఐ ఉపేందర్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. 

కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, రాజేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితులైన A1- దరంసోత్ సరోజ, A2- బానోతు శ్రీనివాసు, A3- తేజావత్ లక్ష్మి అను ముగ్గురికి జీవిత ఖైదీతో పాటు ఒక్కొక్కరికి 2000 రూపాయల జరిమానా విధించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పైకేసులో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు సర్వర్, ఉపేందర్, ప్రస్తుత సి.ఐ మొగిలి, ఎస్.ఐ గణేష్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు , కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, రాజేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లను జిల్లా ఎస్పీ  అభినందించారు.

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >