Posted on 2025-07-05 12:18:44
అదృష్టం వరించింది - మహిళా కూలీకి దొరికిన 15 క్యారెట్ల వజ్రం
కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం వేట - ఓ మహిళకు దొరికిన వజ్రం - అమ్మితే లక్షలే
డైలీ భారత్, కర్నూల్: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వాలిపోతుంటారు. ఏదైనా జాతర గానీ ప్రత్యేకమైన పండుగ గానీ ఉందనుకుంటే తప్పే. అక్కడ వజ్రాల వేట జోరుగా సాగుతుంది. వాన పడిందంటే వేట మొదలు పెడతారు. తొలకరి చినుకులు పలుకరిస్తే చాలు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు.
రంగు రాళ్లు అరచేతిలో మెరిసి తమ రాతను మారుస్తాయని ఆశపడతారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా దూరప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తుగ్గలి మండలం పెండేగల్లు గ్రామంలో 15 క్యారెట్ల బరువైన వజ్రం లభ్యమైంది. మహిళా కూలీ పొలం పనులు చేస్తుండగా ఈ వజ్రం దొరికింది. దీనికి సంబంధించి బేరం కుదరకపోవడంతో ఇంకా కొనుగోలు కాలేదని సమాచారం.
లక్షాధికారులను చేసిన వజ్రం: ఈ క్రమంలోనే మే నెలలో పెరవలి కొల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయం వద్ద ఉంటున్న ఓ వ్యక్తికి రూ.30 లక్షల
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >