Posted on 2025-07-11 19:00:04
డైలీ భారత్, హైదరాబాద్: వాసవి క్లబ్, లక్డీకాపూల్, హైదరాబాద్ తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో లక్డీకాపూల్ వాసవి క్లబ్ లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు బొగ్గుగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూమాలల పక్షాన నేను ఉన్నాను. భవిష్యత్తులో మాలలకు ఏవైనా సమస్యలు ఎదురైనా, నేను ముందుంటాను. మీరు ఒంటరిగా లేరు – నేను చూస్తాను” అంటూ గట్టి భరోసా ఇచ్చారుఅలాగే, మంత్రి SC సబ్డివిజన్ వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయంపై స్పందిస్తూఈ వివక్షను మేము సహించము. మాలల హక్కులను కాపాడేందుకు అవసరమైతే కోర్టులో కూడా పోరాడతాము. ఈ విషయాన్ని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నివేదించి న్యాయం సాధించేందుకు చర్యలు తీసుకుంటాను” అని హామీ ఇచ్చారుఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య , రాష్ట్ర అధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రంజిత్ కుమార్ అధ్యక్షత వహించారుసమావేశంలో మంత్రి ముందు ఉంచిన ముఖ్య డిమాండ్లుమాలలందరికీ బేషరతుగా ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వాలిప్రతి మాలా విద్యార్థికి రాజీవ్ వికాస్ బరోసా లబ్ధి అందించాలిదళితులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలిమాలలకోసం రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పోస్టులను కేటాయించాలిఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని, అలాగే ముఖ్య నాయకులతో కలిసి సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాను అని మంత్రి హామీ ఇచ్చారు
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >