| Daily భారత్
Logo




వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నందున నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలి

News

Posted on 2025-07-18 16:29:08

Share: Share


వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నందున నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: వర్ష భావం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వెంటనే ప్రభుత్వం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కలెక్టర్ టీ. వినయ్ కృష్ణ రెడ్డి ని కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాభావం, సాగునీటి కొరతతో నిజామాబాద్ జిల్లాలో రైతన్నలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. రైతుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. నిజాంసాగర్ కెనాల్ ద్వారా తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నీరు విడుదల చేయకపోతే.. రైతుల పక్షాన బీజేపీ వారం రోజుల్లో ఆందోళనలు చేపడుతుందన్నారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ప్రతి మండలంలోని రైతులతో కల్సి కలెక్టరేట్ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.


కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షలు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు మాస్టర్ శంకర్, పంచారెడ్డి శ్రీధర్, ప్రమోద్, జగన్ రెడ్డి, నారాయణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >