Posted on 2025-08-14 12:00:19
నిండుకుండ లాగా మారిన గుపన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం...
తెల్లవారితే దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో వేడుకలు జరిగేనా..?
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ డివిజన్ గూపన్ పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లోకి గంగస్తాన్ 2 కాలనికి చెందినటువంటి ప్రభుత్వ పాఠశాలలో భారీగా వరద నీరు నేరుగా పాఠశాల మైదానంలో చేరి చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరుపుకోవడానికి వీలు లేకుండా నిండుకుండ కుండల మారింది. దీంతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రజా ప్రతినిధులు కానీ, అటు ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో సమస్యలకు నిలయాలుగా పాఠశాలలు నిలిచాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నమంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించకపోవడం గమనార్హం. సంబంధిత నిధులు పనులు నేటికీ పాఠశాలలో పూర్తి కాక అసంపూర్తిగా నిలిసి కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టి పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >