Posted on 2025-08-14 14:55:57
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:వ్యవసాయ, సహకార శాఖ పరిధిలోని పిఎసీఎస్ఎస్, డిసిసిబిలు, టిజీ క్యాబ్ ల పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగిస్తు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిఓ ఆర్ టినం 386 ను వెలువరించింది. పిఎసీఎస్ఎస్, డిసిసిబిలు, టిజి క్యాబ్ ల వ్యవహారాలు నిర్వహించడానికి పర్సన్ ఇంచార్జీలను నియమిస్తు సహకార శాఖ డైరెక్టర్ కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ లకు ఆదేశాలు జారీ చేశారు. 1964 సెక్షన్ 32 (7) (ఎ) ప్రకారం సంబంధిత పదవికాలం పూర్తయిన తేదీల నుంచి ఆరు నెలల పాటు ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఏది ముందుఐతే అది వరకు అని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే ఆరు నెలల పదవి కాలం పొడిగించబడగా, మరోసారి ఆరు నెలల పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఇప్పట్లో పిఎసీఎస్ఎస్, డిసిసిబిల పాలకవర్గాల ఎన్నికలు జరుగవని తేట తెల్లమైంది. పదవి కాలంలో పొడగింపుతో ప్రభుత్వానికి నిజామాబాద్ డిసిసిబి చైర్మెన్ కుంట రమేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పొడిగింపు కాలంలో రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన అన్నారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >