Posted on 2025-08-14 14:35:47
హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందుతులకు 05 సంవత్సరాల జైలు శిక్ష,500/-రూపాయల జరిమాన విధిస్తూ అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజేయ్ కుమార్ జాధవ్ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్ తెలిపారు.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: చంద్రగిరి గ్రామానికి చెందిన ముత్త ఎల్లయ్య మరియు అతనికి కొడుకు శరత్ తేదీ 25.12.2020 రోజున తన పోలము దున్నుతుండగా తన భూమి పక్కన గల అదే గ్రామానికి చెందిన దేశావేని లింగయ్య, దేశవేని కనకరాజు, దేశవేని శ్రీనివాస్, దేశవేని కనకవ్వ, దేశవేని సరోజన, చోక్కల్ల తిరుమల్లు భూమి విషయంలోని పాత గొడవలు మనసులో పెట్టుకుని దేశవేని లింగయ్య,కనకరాజు, శ్రీనివాస్,కనకవ్వ, సరోజన,తిరుమల్లు అనే వ్యక్తులు ఎల్లయ్య కొడుకు శరత్ పై దాడి చేయగా శరత్ తీవ్ర రక్త గాయం కాగా చికిత్స నిమిత్తం సిరిసిల్ల హాస్పిటల్ కి తరలించి, వేములవాడ పోలీస్ స్టేషన్లో ఎల్లయ్య పిర్యాదు చేయగా అప్పటి సీఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టు లో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు, కానిస్టేబుల్ మధుసూదన్, కోర్టు కానిస్టేబుల్ సురేశ్ లు కోర్టు లో సాక్ష్యులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున *అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరు రాజీ రెడ్డి వాధించగా కేసు పూర్వపాలను పరిశీలించిన అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజేయ్ కుమార్ జాధవ్ ఆరుగురు నిందుతులకు 05 సంవత్సరాల జైలు శిక్ష,500 రూపాయల జరిమాన విధించినట్లు వేములవాడ టౌన్ సి.ఐ వీర ప్రసాద్ తెలిపారు.
పైకేసులో నింధితులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు సి.ఐవెంకటేష్,ప్రస్తుత సి.ఐ వీరప్రసాద్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీ రెడ్డి,CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు,CMS కానిస్టేబుల్ మధుసుదన్,కోర్ట్ కానిస్టేబుల్ సురేష్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >