Posted on 2025-08-17 08:33:53
దిగువన ఉన్న కాలువలకు వదులుతున్న అధికారులు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండుకుండలా మారింది. మహారాష్ట్రలోని గోదావరి ఎగువ భాగంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఎస్ఆర్ఎస్పీకి వరద పోటెత్తింది. శనివారం లక్ష క్యూసెక్కులు వచ్చిన వరద నీరు ఆదివారం 1,51,806 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్టులో 80.5 టీఎంసీల నీటిమట్టానికి గాను 62.104 టీఎంసీల నీటిమట్టం ఉండటంతో నీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదివరకే కాకతీయ కాల్వకు నాలుగు క్యూసెక్కుల నీటిని, అలీ సాగర్ లిఫ్ట్ కు 180 క్యూసెక్కుల, మిషన్ భగీరథ కు231 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో ఇందిరమ్మ వరద కాలువకు నీటి విడుదలను చేసినట్టు ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రావు గుప్తా తెలిపారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >