Posted on 2025-08-17 18:46:50
భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ నిర్వహించిన భక్తులు
డైలీ భారత్, నిజామాబాద్: హిందువుల పండుగల్లో కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు జన్మించిన ఆరోజు ను కృష్ణాష్టమిగా భ క్తులు ఎంతో వైభోపేతంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శనివారమే వివిధ ఆలయాలు నిర్వహించగా ఇందుకు భిన్నంగా నిజాంబాద్ జిల్లా కేంద్రంలో మురళీకృష్ణ ఆలయంలో రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. మొదటి రోజు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ జన్మ దినం సందర్భంగా వివిధ పూజ కార్యక్రమాలతో పాటు అర్చన అభిషేక కార్యక్రమాలతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి శ్రీకృష్ణుని భక్తిశ్రద్ధలతో మొక్కుతుంటారు. కానీ జిల్లా కేంద్రంలో ఉన్న మురళీకృష్ణలయంలో రెండు రోజులపాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. రెండవ రోజు క్రికెట్ నుండి పల్లకిలో ఉంచి పల్లకి సేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీకృష్ణుని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కాగా శనివారం కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు తమ చిన్నారులకు వేషాధరనాలతో అలరించగా రెండవ రోజు గోపిక కృష్ణ అవతారంలో పౌర్ణమి అనే చిన్నారి ఆలయానికి వచ్చి పలువురిని అలరించింది.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >