Posted on 2025-08-17 18:47:56
వరసగా ఎదురవుతున్న ఘటనలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వినాయక్ నగర్ లోని నాగ టవర్ లో గల ఫ్లాట్ నెం.102 లో శనివారం రాత్రి చోరీ జరిగినట్లు నాలుగో టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. దేవసాని విట్టల్ కుంటుబ సభ్యులు వినాయక్ నగర్ లోని నాగ టవర్ లోని 102 ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి తన ఫ్లాట్ లోని ఒక బెడ్ రూంలో నిద్రిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రెండో బెడ్ రూం కిటికీలోకి చొరబడి 12తులాల బంగారం, 30తులాల వెండి చోరీకి పాల్పడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నగరంలోని గత కొన్నాళ్ల క్రితం ఓ అపార్ట్మెంట్లో దొంగలు చొరబడి నగదు తో సహా బంగారాన్ని చట్టం ఎత్తుకెళ్లిన ఘటన మరువకముందే మళ్లీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అపార్ట్మెంట్లో నివాసముంటున్న ప్రజలకు నిద్ర పట్టడం లేదు. ఒకప్పుడు ఇండిపెండెంట్ హౌస్ లను టార్గెట్ చేసి మరి దొంగతనాలకు పాల్పడే ఈ దొంగల ముఠా అపార్ట్మెంట్లను కూడా వదలడం లేదు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >