Posted on 2025-08-25 13:46:35
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీసాయి మెస్ లో శనివారం అర్థరాత్రి న్యూసెన్స్ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించిన నలుగురికి జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ బి.రఘుపతి తెలిపారు. జంగిటి విశాల్, బజ్జుల్వర్ గోవింద్, సందనాల సాయికుమార్, కాలే నవనాథ అనే నలుగురు వ్యక్తులు న్యూసెన్స్ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించారని తెలిపారు. సిటీ పోలీస్ ఆక్ట్ కింద వారపై కేసు నమోదు చేసి మంగళవారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జీ ముందు హాజరు పరుచగా ఒక్కొక్కరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధుల గుండా తిరుగుతూ నగరవాసులను ఇబ్బందులకు గురిచేసినట్లు తమకు ఫిర్యాదు ఎంతటి వారిని అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిపి ఆదేశాల మేరకు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >