Posted on 2025-08-27 16:26:27
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచఆదిదేవుడు వినాయకుడి అనుగ్రహం, ఆశీస్సులు మనందరికీ కావాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
వినాయక చవితి సందర్భంగా పాల్వంచ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహ ప్రతిష్ఠా పూజల్లో కొత్వాల పాల్గొని, పూజలు చేశారు.
పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ యూత్ ఆధ్వర్యంలో, రాంనగర్ లో కాపు సంఘం ఆధ్వర్యంలో, యూత్ కమిటీ ఆధ్వర్యంలో, వడ్డుగూడెం లో షేక్ ఖాసీం ఆధ్వర్యంలో, బొల్లోరిగూడెం లో వర్తక సంఘం ఆధ్వర్యంలో, కాంట్రాక్టర్స్ కాలనీలో, రాహుల్ గాంధీ నగర్ లో, శ్రీనగర్ లో* ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవ మండపాలను కొత్వాల సందర్శించి, పూజలు చేశారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ...
మనం చేసే పనులను ఎలాంటి విఘ్నలు ఏర్పడకుండా గణేశుడు ఆడుకుంటారన్నారు. నిత్యం గణేశున్ని పూజిస్తే శుభాలు జరుగుతాయని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, నాయకులు SVRK ఆచార్యులు, బద్ది కిషోర్, కందుకూరి రాము, చింతా నాగరాజు, ఉండేటి శాంతివర్ధన్, లక్ష్మణ్, కాపా శ్రీను, అజిత్, చిన్న పండు, పెండ్యాల కృష్ణమూర్తి, చలవాది ప్రకాష్, సకినాల రాము, సాదం రామకృష్ణ, చావా శ్రీను, నాని, డిష్ ప్రసాద్, పొందూరి నరసింహారావు, కర్నాటి వేణు, గంధం నర్సింహారావు, కేశబోయిన కోటేశ్వరరావు, బాడిశ శంకర్ రావు, NP నాయుడు, మల్లేష్ నాయుడు, SK ఖాసీం, వెంకటనారాయణ, డోలి శ్రీను, అన్వార్, శంకరన్న, సూర్యం, పుల్లారావు, ఉదయ్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >