Posted on 2025-08-27 16:37:55
కామారెడ్డి జిల్లా ప్రాంత ప్రజల మనోవేదన..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బుధవారం తెల్లవారుజామున నుండి కామారెడ్డి జిల్లాలో ఎర్రతిరుపుగా లేకుండా కురుస్తున్న వర్షాలు వాగులు, వరదలు, వంకలు జిల్లాలో తాము పుట్టిన నాటి నుండి చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు సంభవించలేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎకో బాగాన మహారాష్ట్రలో అత్యధిక వర్షాలు కురియడంతో శ్రీ రామ్ సాగర్ నిండి పొంగిపొర్లుతుందని దీంతో అధికారులు చేసేదేమీ లేక అన్ని గేట్లు ఎత్తివేయడంతో వర్షపు నీటితోపాటు శ్రీరాంసాగర్ వరద నీరు కూడా రావడంతో ఇంత నష్టం వాటిల్లిందని ఇలాంటివి ఘటనలు తమ పుట్టినప్పటి నుండి ఎప్పుడూ చూడలేమని వృద్ధులు చెప్పుకొస్తున్నారు. ఏవో అప్పుడప్పుడు వర్షాకాలంలో కురిసే వానలకు వాగులు నిండడం చూసానే కానీ ఇంత పెద్ద స్థాయిలో తమెప్పుడూ చూడలేమని ఆ జిల్లా వాసులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణ ఆస్తి నష్టం పొందిన వారికి సాయం అందించాలని కోరారు. ఇంకా రెండు రోజులపాటు వర్షాలు ఉంటాయంటున్నా నేపథ్యంలో అక్క అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకొని ప్రజలను క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు కోరారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >