Posted on 2025-08-30 04:38:50
బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీల ఎజెండా ఒకటేనని నీకేం కావాలో నాకు చెప్పు, నాకేం కావాలో నీకు చెప్తా అన్నట్టు ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్, డీపీఓలతో ఫోన్ ద్వారా సంప్రదించిన అనంతరం, జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు, వరదల నిర్వహణ వంటి కీలక సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించిందని జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలను ఆయన తెలియజేశారు. అదేవిధంగా శనివారం మండల కేంద్రాలలో జరిగే సమావేశాలలో మండల అధ్యక్షులు పాల్గొని ఓటరు జాబితాలో ఏమైనా మార్పులు,చేర్పులు చేయాలనుకుంటే, అవసరమైన ఆధారాలతో వెంటనే గ్రామ, మండల, పట్టణ శాఖ అధ్యక్షులను సంప్రదించాలని పేర్కొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >