| Daily భారత్
Logo




విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పెయింటర్ మృతి..

News

Posted on 2025-08-31 09:41:09

Share: Share


విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పెయింటర్ మృతి..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల  విద్యుత్​ తీగలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇళ్ల మీద నుంచి కరెంట్ తీగలు వెళ్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాం నగర్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ ఇంటిపై ఇటీవల అకాల వర్షాలకు, గాలి దుమారంకు  విద్యుత్ వైర్లు తెగి ఇంటిపై వేలాడడంతో అది గమనించని ఓ పెయింటర్​ విద్యుత్​ షాక్​తో మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన నాందేవ్​ (45) సంవత్సరాల వ్యక్తి ఆ ఇంటికి పెయింటింగ్​ వేయడానికి వచ్చాడు. అయితే ఇంటిపైన విద్యుత్​ తీగలు ఉన్నాయి. నాందేవ్ ప్రమాదవశాత్తు వాటికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై గంగాధర్​ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >