Posted on 2025-09-08 17:09:39
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆర్టీసీ బస్ ఢీకొని యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని కంఠేశ్వర్-రైల్వే కమాన్ వద్ద చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక మూడవ టౌన్ ఎస్ఐ హరీష్ బాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని విక్లీ బజార్ కు చెందిన సంతోష్ (36) సంవత్సరాల యువకుడు తన బైక్ పై నిజామాబాద్ నగరం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుగా వెలుతున్న కార్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో దాని వెనుక ఉన్న ప్రైవేట్ స్కూల్ బస్ ను వెనుకనుంచి సంతోష్ ఢీకొట్టాడు. దీంతో యువకుడు ప్రయాణిస్తున్న బైక్ ను ఎదురుగా నుండి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని 108 అంబులేన్స్ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలపడం జరిగిందని పోలీసులు వివరించారు. సంతోష్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాసి కాగా నగరంలో టైల్స్ పనిచేస్తు జీవిస్తున్నట్టు తెలిసింది. మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >