Posted on 2025-09-26 12:39:06
ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే తెల్లం
డైలీ భారత్, భద్రాచలం: శ్రీ దేవి శరన్నవత్రుల సందర్బంగా భద్రాచలం భగవాన్ దాస్ కాలనీ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మ, భద్రాచలం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆర్ ఐ బుద్ధ నరసింహారావు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 11:30 నుండి ప్రారంభం అయిన ముగ్గుల పోటీలకు భద్రాచలంలో వివిధ ప్రాంతాల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి బహుమతి బి రాజేశ్వరి, రెండవ బహుమతి బి వాణి, మూడో బహుమతి ప్రియ, నాలుగో బహుమతి వశం హరిప్రియ, ఐదవ బహుమతి హానిష గెలుపొందారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్నారని , అమ్మ వారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని అన్నారు.
ఈ పోటీలలో గెలుపొందిన వారికీ బహుమతులు అందించిన దాత సమ్మక్క సారక్క దేవుడమ్మ తూరుబాక కి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూక్యా రంగా, ముగడ హరినాథ్, ఎస్కే సిరాజ్, ప్రియ, సాయి కౌశిక్, గణేష్, వినీత్, నాగేశ్వర రావు, సుదర్శన్, రామాచారి, సున్నం భూలక్ష్మి, తెల్లం సునీత, స్వరూప, సుశీల, లీలావతి, ప్రియాంక, రమణమ్మ, క్రిష్ణ ప్రియ,కైక, కుమారి,అనిత, ఉష, వాణి, రమణ, కమల, యశోద, మీనా, మహేష్, సంతోష్, హరికృష్ణ, గోపాల కృష్ణ, లత, రమ్య, జయ, మని, భక్తులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >