Posted on 2025-09-27 06:20:51
జనసేన శ్రేణులకు కీలక ఆదేశాలు
డైలీ భారత్, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా హైదరాబాద్ మహానగరం తడిసిముద్దైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాల నుంచి వరద నీరు విడుదల చేయడవంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఈ పరిణామంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వదర నీరు వచ్చి చేరింది.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు, తెలంగాణ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలని సూచించారు. వరద బాధితులకు మనోధైర్యం కల్పించి వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని, మూసీ వరదతో MGBS పరిసరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
#mgbs #pawan Kalyan #musi #hyderabad
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 16:25:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 15:47:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 15:46:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 15:20:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 15:11:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 15:09:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >