| Daily భారత్
Logo




“క్షమాపణ” చెప్పి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కవిత!

News

Posted on 2025-10-25 10:17:16

Share: Share


“క్షమాపణ” చెప్పి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కవిత!

డైలీ భారత్, హైదరాబాద్: కల్వకుంట్ల కవిత తన జాగృతి తరపున జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా తెలంగాణ వీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ తరపున క్షమాపణలు చెప్పారు. 10 సంవత్సరాల పాలనలో వీరులకు, వారి కుటుంబాలకు సరైన గౌరవం, మద్దతు అందించలేకపోయామని ఒప్పుకున్నారు.

అసెంబ్లీలో 1,200 మంది అమరవీరులను ప్రకటించామని, కానీ కేవలం 580 కుటుంబాలకు మాత్రమే రూ.10 లక్షలు , ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ప్రభుత్వం గుర్తించిన మొత్తం 1,200 కుటుంబాలకు రూ. 1 కోటి సహాయం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంలో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. కవిత ప్రకటన బీఆర్ఎస్ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారందరినీ తాము గౌరవించామని బీఆర్ఎస్ పార్టీ ఇంత కాలం చెబుతూ వస్తోంది.

కానీ ఇప్పుడు స్వయంగా కవితనే తాము ఏమీ చేయలేదని చెప్పడం.. తాను రూ. కోటి సాయం అందించేందుకు పోరాడతానని చెప్పడం ఆ పార్టీని విస్మయానికి గురి చేస్తోంది. కవిత ఇప్పుడు బీఆర్ఎస్ లో లేరు..కానీ ఆమె ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ కుమార్తె. ఆమెనే ఇలా ప్రకటిస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ ఎలా ఉంటుంది ?. కవిత ప్రారంభం చూస్తే.. బీఆర్ఎస్ దగ్గర ఏ మూల అయినా తెలంగాణ వాదం అనే బలం మిగిలి ఉంటే… అది తన సొంతం కావాలన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ టార్గెట్ గానే ఆమె రాజకీయాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >