| Daily భారత్
Logo




మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య

News

Posted on 2025-11-24 11:31:10

Share: Share


మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య

జిల్లాలోని చందూరు మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణం

పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి గతరాత్రి గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్.. పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ  చదువు ఒత్తిడి నే కారణమా.. లేదా ఇతర ఏదైనా కారణాలు ఉండవచన్న అనుమానాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  ఏది ఏమైనా చిన్న వయసులోని అది ఓ ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవడం పట్ల విద్యార్థి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే తమ దర్యాప్తు పూర్తయిన తర్వాత  వెల్లడిస్తామని ఎస్సై సాయన్న వివరించారు.

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >