Posted on 2025-11-26 11:19:43
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:హైదరాబాద్లోని అంబర్ పేట్,పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై భాను ప్రకాష్, సర్వీస్ తుపాకీ మిస్స్ అయ్యింది. ఈ కేసులో తీవ్ర అనుమా నాలు వ్యక్తమవుతున్నా యి. జనవరిలో జరిగిన ఒక క్రైమ్ కేసులో భాను ప్రకాష్ బంగారం రికవరీ చేసిన ప్పటికీ
ఆ రికవరీని అధికారిక రికార్డుల్లో చూపించకపోవడం పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఎస్సై భాను ప్రకాష్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో పాటు సస్పెండ్ చేశారు.ఇదే సమయంలో అతని సర్వీస్ తుపాకీ కూడా కనిపించక పోవడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారింది,
జనవరిలో జరిగిన క్రైమ్ కేసులో ఎస్సై భాను ప్రకాష్, ఓ దొంగతనం కేసులో బంగారం రికవరీ చేశాడు. అయితే ఆ బంగారాన్ని స్టేషన్ రికార్డుల్లో చూపిం చకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. రికవరీ బంగారంతో పాటు అతని సర్వీస్ తుపాకీ కూడా కనిపించకపోవడంతో వివాదం పెద్దదైంది.
అయితే ఎస్ఐ భాను ప్రకాష్,కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బెట్టింగ్ మోజులో ఆయన అప్పుల పాలయ్యారని, నిర్ధారించుకున్న పోలీస్ అధికారులు ఆ బంగారంతో పాటు తుపాకిని తాకట్టు పెట్టినట్లు భావిస్తున్నారు. భాను ప్రకాష్ ఆర్థిక ఇబ్బం దులతో ఈ పని చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఘటనపై అంబర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిం చారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్సై భాను ప్రకాష్ను వివరంగా విచారిస్తున్నారు. తుపాకీ, బంగారం ఎక్కడ ఉన్నా యన్న దానిపై పోలీ సులు క్లూస్ సేకరిస్తున్నారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >