Posted on 2025-11-26 15:43:45
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:ఓ వైపు రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు ప్రజల జేబులు గుల్ల చేస్తుంటే మరోవైపు కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నగరంలోని ఫిల్మ్నగర్ పరిధిలో ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ గా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్నగర్ పరిధిలో నివాసం ఉంటున్న శశికాంత్ అనే వ్యక్తి తనకు తానుగా ఐఏఎస్ అని చెప్పుకుంటూ హల్చల్ చేస్తున్నాడు. ఏకంగా ఇద్దరు గన్మెన్లు, ఫేక్ ఐడీ కార్డులను పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. నగర శివార్లలో నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్ల వద్దకు వెళ్లి బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానని బాధితుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చిందు. అసలు అతడు ఐఏఎస్ ఆఫీసరే కాదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >