Posted on 2025-11-27 08:05:46
పూర్తిగా దగ్ధమైన కంప్యూటర్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు
ఫైర్ సేఫ్టీ సదుపాయం బ్యాంకులో లేకపోవడం వల్లే ఇంత భారీ నష్టం జరిగిందా..?
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని సుభాష్నగర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో మంగళవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో బ్యాంకులోని 25 కంప్యూటర్లు, 7 ఏసీలు, అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బ్యాంకు మేనేజర్ రంజిత్ మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉందని వెల్లడించారు. సమాచారం అందుకున్న 3 టౌన్ ఎస్హెచ్ఓ హరిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ బ్యాంకులో సైడ్ సేఫ్టీకి గల సంబంధించిన సదుపాయాలు బ్యాంకు నిర్వాహకులు అమర్చారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం సంభవించి కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధం కావడం పట్ల ప్రజల్లో బ్యాంకులంటేనే నమ్మకం కలిగేలా ఉన్న ప్రజలకు ఇలాంటి అగ్నిప్రమాదం వల్ల బ్యాంకులంటే ఏ మేరకు సురక్షితం అనే సందిగ్ధంప్రజల్లో నెలకొంది.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >