Posted on 2025-11-28 13:09:27
డైలీ భారత్ స్పెషల్, శీర్షిక:
శీర్షిక : ఓటరు మేలుకో
వస్తున్నాయి పంచాయతీ ఎన్నికలు
వస్తున్నారు నవాబులు
నాయకుల మాటలు అందని
ద్రాక్షా గుత్తులు అని గుర్తుంచుకో
సాన పెట్టు నీ ధిమాకు
ముందు నుయ్యి వెనుక గొయ్యి
కండ్లు తెరచి ఓటు వేయ్యి
మద్యానికి బానిసై భవిష్యత్
మరిచిపోకు
డబ్బుకు ఓటు హక్కును దాసోహం
చేయకు
నాయకుల మాయ మాటలు విని
ఆగమాగం కాకు అరిగోస పడకు
దారి తప్పి బురద లో కూరకు
ఎన్నికల ముందు దండాలు పెడతారు
ఎన్నికల తరువాత మంట పెడతారు
ఇది కవిత కాదు కలత
ముందు తరాల బవిత
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ
రచన మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >