| Daily భారత్
Logo




ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోరుతూ ప్రధానమంత్రికి ఇమెయిల్ ద్వారా వినతిపత్రం : టిఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల

News

Posted on 2025-11-28 16:09:33

Share: Share


ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోరుతూ  ప్రధానమంత్రికి ఇమెయిల్ ద్వారా వినతిపత్రం : టిఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) పిలుపు మేరకు టిఎస్ యుటిఎఫ్ (తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యములో  ప్రధాన మంత్రికి వినతిపత్రాలు ఇ మెయిల్ ద్వారా పంపారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులు టెట్ పాస్ కావలనడం అన్యాయమని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా తీర్పుపై సమీక్షకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పిస్తామనే భరోసా కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీటిఈ నోటిఫికేషన్ ప్రకారమే 2010 ఆగస్టు 23 కు ముందు నియామకం అయిన ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని పేర్కొన్నందున గత 15 సంవత్సరాలుగా టెట్ వ్రాయాలనే ఆలోచన చేయలేదని, డిఎస్సీ పరీక్ష వ్రాసి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఇప్పుడు అర్హత పరీక్ష వ్రాయాలనడం హాస్యాస్పదమని  పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీనియర్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపునిస్తూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో  చట్టం చేయాలని, అందుకు పార్లమెంటు సభ్యులు అందరూ తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో TSUTF జిల్లా పూర్వ అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, జిల్లా ప్రస్తుత అధ్యక్షులు పర్కాల రవీందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి రమేష్, జిల్లా కార్యదర్శులు ఎలగొండ రవి పాముల స్వామి లు పాల్గొన్నారు.


Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >