Posted on 2025-11-28 17:44:37
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహం సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో మారం ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను మారం యశ్వంత్ రెడ్డి, మల్లేశ్వరి వివాహ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురాబత్తుని శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ చైర్మన్ ఐ క్యాంప్స్, పాల్గొని ప్రసంగించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను దివ్యాంగుల కొరకు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే శుక్రవారం లయన్స్ క్లబ్ సభ్యులైన మారం ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల మధ్యలో నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉంది అన్నారు.
స్నేహ సొసైటీ కార్యదర్శి, ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ కార్యదర్శి కుమ్మరి పోశెట్టి, దివ్యాంగ బాలలు, సిబ్బంది పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >