Posted on 2025-11-28 19:39:27
డైలీ భారత్ న్యూస్ సిరిసిల్ల: తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లలిత అనే మహిళకు అభిలాష్ అనే కొడుకు ఉన్నాడు. ఇతను సిరిసిల్ల సర్దాపూర్ 17 బెటాలియన్ లో టీజీఎస్పీ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తు్న్నాడు. ఏమైందో ఏమో తెలీదు గానీ.. గురువారం లలిత సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గురువారం మొత్తం గాలించారు. అలాగే గ్రామస్తులు కూడా పరిసరాలు మొత్తం వెతికారు. ఈ క్రమంలో చివరకు శుక్రవారం లలిత మృతదేహాన్ని బయటికి తీశారు.
తల్లి మృతదేహాన్ని చూసి.. కొడుకు అభిలాష్ తట్టుకోలేకపోయాడు. తల్లి దూకిన వాగులోనే తానూ దూకాడు. అయితే ఆ సమయంలో అక్కడున్న వారికి ఈత రాకపోవడంతో అతన్ని కాపాడలేకపోయారు. చివరకు కొడుకు కూడా అదే వాగులో ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులంతా కన్నీటిపర్యంతమయ్యారు. తల్లి బాగోగులు చూసుకునే కొడుకులు కనుమరుగవుతున్న నేటి రోజుల్లో.. తల్లి లేదన్న విషయం తెలిసి, తానూ ఆత్మహత్య చేసుకున్న కొడుకును చూసి అంతా అయ్యో పాపం అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లి, కొడుకు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >