Posted on 2025-12-01 18:30:40
పీసీసీ చీఫ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీల సమక్షంలో ప్రమాణ స్వీకార మహోత్సవం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాటేపల్లి నగేష్ రెడ్డి , నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ లను అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులకు అభినందనలు తెలియజేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి వరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >