Posted on 2025-12-01 20:14:31
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణమే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ మరియు మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మల్లోజు సత్యనారాయణ చారి అన్నారు. నాగోల్ లోనే పల్లవి ఇంజనీ రింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల కార్యవర్గాల ఎంపిక నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షునిగా మల్లోజు సత్యనారాయణ చారి ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి కమలాకర్ రావు ఉపాధ్యక్షులుగా పొడిశెట్టి రమేష్ కుమార్, బొడ్డుపల్లి అంజయ్య సుజాత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే సంయుక్త కార్యదర్శిలుగా టీ రత్న ప్రసాద్ గునుగుంట్ల శ్రీనివాస్ గౌడ్,నాగేందర్,యాదగిరి కోశాధికారిగా రవికుమార్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె. శ్రీధర్ రావు ప్రచార కార్యదర్శిగా కే వెంకట్రావు కార్యదర్శిగా గడ్డం స్వప్న ముఖ్య సలహాదారులుగా జైపాల్ లాండే పి శ్రీనివాస రావు న్యాయ సలహాదారుడులు గా చెష్టి . ఈసీ సభ్యులుగా రవీందర్రెడ్డి,నరహరి,దయానంద్, రవికుమార్ ఇలా రాష్ట్రస్థాయిలో భారీ కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చారి మాట్లాడుతూ వైద్య విద్యార్థుల అడ్మిషన్లు ప్రక్రియ పూర్తి కావడం జరిగిందని,ఈ అడ్మిషన్లు ప్రక్రియలో మా అసోసియేషన్ ఎన్నో సహాయ సహకారులకు అందడం జరిగిందని. అలాగే వైద్య విద్యార్థులు ఎలాంటి సమస్యలు వచ్చిన స్పందించే విధంగా ఉమ్మడి పది జిల్లాలలో ఇన్చార్జి లను నియమించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని కళాశాలలో ర్యాగింగ్ భూతం విపరీతంగా ఉంది అని మా దృష్టికి వచ్చిందని. ఈ ర్యాగింగ్ ను అరికట్టడానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల ఇన్చార్జిలను నియమించడం జరిగిందని ఆయన అన్నారు.
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >