Posted on 2025-12-05 21:12:24
డైలీ భారత్ న్యూస్, డోర్నకల్: మండలం లో నీ గొల్లచెర్ల గ్రామ నామినేషన్ కేంద్రంకు హాజరయ్యేందుకు హూన్యతండా గ్రామానికి చెందిన భూక్యా మంజులరాంబాబు నాయక్ 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేయడానికి మహిళ తన 6 నెలల బాబుతో వచ్చింది. మూడో విడత స్థానిక సర్పంచ్ ఎన్నికలో భాగంగా నామినేషన్ కేంద్రం వద్ద గురువారం వివిధ పార్టీల నుండి సర్పంచ్, వార్డులుగా పోటీ చేసే అభ్యర్థులు మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా రావడంతో సమయం ఎక్కువ అయ్యే అవకాశం ఉండడంతో అయినప్పటికీ ఆ తల్లికి తన చిన్నారిని ఎన్నికల నామినేషన్ కేంద్రంకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే నామినేషన్ కేంద్రం వద్ద ఉన్న డ్యూటీ నిర్వహిస్తున్న ఎస్సై గడ్డం ఉమా ఆమెకు మద్దతుగా నిలిచారు.నామినేషన్ దాఖలు చేస్తున్న మహిళ బిడ్డను చూసుకుంటున్న మహిళా ఎస్సై పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >