Posted on 2025-12-09 15:34:00
నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడి వినూత్న ప్రయత్నం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మోస్రా మండలoలోని గోవూర్ గ్రామంలో ఒక యువకుడు ఇంటి ముందు వినూత్నంగా ఫ్లెక్సి ఏర్పాటు చేశాడు.మా ఇంట్లో ఎవరి ఓట్లు అమ్మబడవు..సర్పంచ్,వార్డ్ మెంబర్ గా పోటీ చేసే అభ్యర్థులు మమ్మల్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకండి.. మేము నిజాయితీగా గ్రామ అభివృద్ధికి పాటుపడే నాయకునికి మా ఓటును వేస్తాము.. అని ఫ్లెక్సీలో వ్రాశాడు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడిలో ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్న నేపథ్యంలో ఈ యువకుడు చేస్తున్న వినూత్న ప్రయత్నానికి కొందరిలోనైనా మార్పు వస్తే బాగుంటుందని ఆ యువకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికే తమ ఓట్లు వేస్తామని మార్పు అందరిలో రావాలనే దృఢ సంకల్పంతో మార్పు నాతోనే మొదలవ్వాలని వినూత్న ప్రయత్నం చేస్తున్నానని నవీన్ రెడ్డి పేర్కొన్నారు.
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >