| Daily భారత్
Logo




ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత

News

Posted on 2025-12-14 00:07:49

Share: Share


ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతీ పౌరుడు ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవాలి. అది ఎక్కడో లేదు, నీలోనే ఉందని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తన బాధ్యత తెలుసుకోవాలి. రాష్ట్రం,గ్రామం,ప్రతి వాడా అభివృద్ధి చెందాలి, మనందరం బాగుండాలి అనే తాపత్రయం ఉంటేనే సరిపోదు, అందుకు ప్రతీ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే నిర్ణేతలు.  ఓటు అనేది సాధారణ గుర్తు కాదు, పౌరుడు దేశ, రాష్ట్ర, గ్రామ  భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి” అని పేర్కొన్నారు.మనం నివసిస్తున్న దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల మాటే పరమాధికారం. ఇలాంటి వ్యవస్థలో పౌరుడు పొందే అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి భారత పౌరుడు ఓటు వేసే హక్కును పొందుతాడు. ఈ హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా లభించడం మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. ప్రజలు కులం, మతం, డబ్బు, మద్యం వంటి ప్రభావాలకు లోనుకాకుండా అభ్యర్థుల సేవాభావం, నిజాయితీ, పని తీరు మాత్రమే పరిశీలించి ఓటు వేయాలని ఆయన సూచించారు. ఓటు వేయకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి నష్టం చేయడమేనని, ఒక చిన్న ఓటే మంచి నాయకులను ముందుకు తెచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఎన్నికల సమయంలో యువత ఎక్కువగా జాగ్రత్తగా ఉండి, తన హక్కును వినియోగించడమే కాక, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి. ప్రతి పౌరుడు ఓటు వేయడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలి. మన ఓటు మన భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది కాబట్టి అందరు ఓటు వేయాలని ఆపేక్షించారు.

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >