Posted on 2025-12-20 20:11:45
అంత్యక్రియల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ఏడవ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ బీజేపీ సీనియర్ నాయకుడు బట్టిగిరి ఆనంద్ (45) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన మరణించిన వార్త వినగానే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హుటాహుటిన తన ఇంటికి వెళ్లి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టిగిరి ఆనంద్ తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పుడు హిందూ ధర్మం కోసం బిజెపి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ బిజెపి పార్టీకి ఒక సైనికుడిలా ఆయన పనిచేశారని ఆయన మరణించారని వార్త నమ్మలేకపోతున్నాను అని ఆయన పార్టీని తన కుటుంబ సభ్యులను అకస్మాత్తుగా వదిలి మరణించినప్పటికీ ఆయన జ్ఞాపకాలు అయన పార్టీ కోసం చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోనని ఆయన అన్నారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకుంటానని ఎమ్మెల్యే ఆనంద్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఆనంద్ పవిత్ర ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు. మరోవైపు సీనియర్ నేతైన ఆయన మృతి పట్ల బిజెపి శ్రేణుల్లో ఆయన కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణ ప్రాంతంలోని 7వ డివిజన్ శక్తి కేంద్రం ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ నాయకుడి ఆకస్మిక మృతితో పార్టీలో విషాదఛాయలు నెలకొన్నాయి. అర్బన్ ఎమ్మెల్యేతో పాటు ఆనంద్ పార్దివ దేహానికి బిజెపి పార్టీ సీనియర్ నేతలు, పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలా ఉండగా సాయంత్రం జరిగిన ఆనంద్ అంత్యక్రియాల్లో అర్బన్ ఎమ్మెల్యే హాజరయ్యారు. అంతేకాకుండా తన అనుచరుడు కావడంతో ఎమ్మెల్యే ఆనంద్ పాడే ను మోసి అందరి అభిమానాన్ని చాటుకున్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >