Posted on 2025-12-21 15:33:02
డైలీ భారత్ న్యూస్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మోడర్న్ కబడ్డీ జిల్లా స్థాయి సెలెక్షన్స్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హనుమాజీపేట గ్రామ సర్పంచ్ జంకే మధు, వార్డు మెంబర్ కార్తీక్, జంకే లావణ్య, మల్లేశం హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా మోడర్న్ కబడ్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి తడకల సురేష్, కార్యవర్గ సభ్యులు విక్కుర్తి అంజయ్య, సందేల నరేష్, చిలుక ప్రభాకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.
జిల్లా స్థాయి సెలెక్షన్స్ సందర్భంగా హనుమాజీపేట గ్రామ సర్పంచ్ జంకే మధు అమ్మగారి జ్ఞాపకార్థంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు రూ.10,000/- విలువ గల జెర్సీలను అందజేశారు.
ఈ జిల్లా స్థాయి సెలెక్షన్స్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26 నుండి ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి మోడర్న్ కబడ్డీ క్రీడా పోటీలలో పాల్గొంటారని జిల్లా ప్రధాన కార్యదర్శి తడకల సురేష్ తెలిపారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >