| Daily భారత్
Logo




కోర్టులను ఆశ్రయించిన బాధితులకు తక్షణ న్యాయ సాయం అందాలి

News

Posted on 2025-12-21 17:35:17

Share: Share


కోర్టులను ఆశ్రయించిన బాధితులకు తక్షణ న్యాయ సాయం అందాలి

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:న్యాయాన్ని కోరుకుంటూ కోర్టులను ఆశ్రయించిన బాధితులకు తక్షణ న్యాయ సాయం అందే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని హుజూర్ నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహన్ న్యాయవాదులను కోరారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు హాల్ నందు జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులు అనునిత్యం అధునాతన న్యాయ గ్రంథాలను, న్యాయ శాస్త్రాలను,ఉన్నత న్యాయస్థానాలు వెలువరించే తీర్పులను నిరంతరం చదువుతూ న్యాయ విజ్ఞానం పెంపొందించు కోవాలని సూచించారు. హుజూర్ నగర్ కోర్టులో తను కొద్ది కాలం పాటే పనిచేసినప్పటికీ న్యాయ వాదులు నాకు సహకరించిన తీరు ఈ ప్రాంత వాతావరణం ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. తన విధి నిర్వహణలో ఏదైనా సందర్భంలో కఠినంగా వ్యవహరిస్తే అది వృత్తిపరమైన చర్యలో భాగమే కాని వ్యక్తిగతం కాదన్నారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన బార్ అసోసియేషన్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా లు మాట్లాడుతూ తమకు ఉద్యోగ పరంగా ఏదైనా సందేహం ఏర్పడినప్పుడు అదనపు జిల్లా న్యాయమూర్తి చేత నివృత్తి చేసుకునే వారమని ఉద్యోగ పరంగా వారు మాకు అనేక రకాలుగా సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >