Posted on 2026-01-04 14:55:06
డైలీ భారత్, హుజూర్ నగర్: మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విడుదల చేసిన 28 వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితాను డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2026లో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల ఓటర్లు తమ కుటుంబ సభ్యుల ఓట్ల నమోదును పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ పరిశీలనాధికారికి లిఖిత పూర్వకంగా జనవరి 4 సాయంత్రం 5.00 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు నేడే చివరి రోజుని ఆయన తెలిపారు
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >