Posted on 2026-01-12 17:34:35
డైలీ భారత్, సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో కీ.శే మంకు రాజయ్య జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న టీచర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ సోమవారం రోజున ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతు జాతీయ అవార్డు గ్రహీత, కీర్తీ శేషులు మంకు రాజయ్య గారు చిరస్మనీయులు అని,వారు విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారని,ఉపాధ్యాయులందరూ ఐక్యమత్యాంగా ఉండేలా ఆహ్లాదకరమైన వాతావరణంను పెంపొందించేలా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.. ఈ టోర్నమెంట్ లో జిల్లాలోని 13 మండలాల నుండి ఉపాధ్యాయులను 6 జట్లుగా విభజించి లీగ్ పద్ధతిలో మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కే. కే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని, జిల్లా పేరుని రాష్ట్ర స్థాయిలో మారుమోగిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్,వివిధ మండలాల విద్యాధికారులు, నిర్వాహకులు శర్మన్ నాయక్,జయకృష్ణారెడ్డి, నవీన్,రవీందర్, భాస్కర్ రెడ్డి,రవి,తిరుపతి,సంతోష్, మల్లికార్జున్ మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,మంకు రాజయ్య అభిమానులు పాల్గొన్నారు
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >