Posted on 2026-01-12 19:55:46
డైలీ భారత్, భూపాలపల్లి జిల్లా: ఈరోజు భూపాలపల్లి మండలం గొర్ల వేడు తండా గ్రామంలో భూత్ అధ్యక్షులు నంగావత్ తిరుపతి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా
బిజెపి జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు హాజరైనారు వారు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు. యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచిన స్వామి వివేకానంద జయంతి (జనవరి 12) పురస్కరించుకుని ఆయన చెప్పిన సూక్తి ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్న మాటలను గుర్తు చేసారు.. యువతను జాగృతం చేసిన స్వామి వివేకానంద గారి ఆలోచనలు ఆదర్శాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు వారు చూపిన విలువల బాటలో నడుచుకుంటూ దేశ నిర్మాణంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తూ మరింత బలంగా ముందుకు సాగాలని కోరారు
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నరాల కొమురయ్య గారు బిజెపి సీనియర్ నాయకులు మందల రాంచంద్రారెడ్డి గారు బూత్ అధ్యక్షులు దుండ్ర రాజు మామిడి కుమార్ భూక్య రవి మోత్కూరి నాగరాజు ఆరుగొండ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >